న్యూఢిల్లీ, మార్చి 31: ప్రముఖ ఫార్మా సంస్థ జీఎస్కేకు కర్ణాటకలో ఉన్న ప్లాంట్ను హెటిరో ల్యాబ్స్కు విక్రయించే ప్రతిపాదనకు బోర్డు ఏకగ్రీవంగా అనుమతినిచ్చింది. ఒప్పందం విలువ రూ.180 కోట్లు. మంగళవారం సమావేశమైన కంపెనీ బోర్డు కర్ణాటకలోని వెంగల్ వద్ద ఉన్న ప్లాంట్, భూమి, పరికరాలు, ఆస్తులు, సాఫ్ట్వేర్ పరికరాలు హెటిరో ల్యాబ్కు అందించనున్నది. ఈ విషయాన్ని కంపెనీ బీఎస్ఈకి సమాచారం అందించింది. ఇరు సంస్థల మధ్య కుదిరిన ఈ కొనుగోలు ఒప్పందం సెప్టెంబర్ 30, 2021 నాటికి పూర్తికానున్నది.
ఇవీ కూడా చదవండి
సెప్టెంబర్ 30 వరకు పాత పద్ధతిలోనే ఆటో డెబిట్ సౌకర్యం..!
పాన్, ఆధార్ లింక్ తుది గడువు జూన్ 30కు పొడిగింపు