న్యూఢిల్లీ, జూలై 16: డిజిటల్ పేమెంట్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ పేటీఎం.. మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి తమ ప్రతిపాదిత రూ.16,600 కోట్ల ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) డ్రాఫ్ట్ పేపర్ల (డీఆర్హెచ్పీ)ను దాఖలు చేసింది. సెబీ ఆమోదం లభిస్తే దేశీయంగా ఇదే అతిపెద్ద పబ్లిక్ ఇష్యూ కానున్నది. కాగా, ఈ మెగా ఇష్యూలో రూ.8,300 కోట్లను ఫ్రెష్ ఈక్విటీ ద్వారా, మరో రూ.8,300 కోట్లను ఆఫర్-ఫర్-సేల్ ద్వారా సమీకరించనున్నట్లు సెబీకి పేటీఎం ఈ సందర్భంగా తెలిపింది. ఆఫర్-ఫర్-సేల్లో పేటీఎం అధినేత విజయ్ శేఖర్ శర్మతోపాటు, అలీబాబా గ్రూప్ సంస్థలు కొంతమేర వాటాలను విక్రయించనున్నాయి.