న్యూఢిల్లీ, మార్చి 22: బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ)ను పెంచుతూ తెచ్చిన ఇన్సూరెన్స్ సవరణల బిల్లుకు పార్లమెంట్లో ఆమోదం లభించింది. సోమవారం లోక్సభ దీనికి గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. గత వారం రాజ్యసభ నుంచి అనుమతి వచ్చిన విషయం తెలిసిందే. ఈ బిల్లుతో ఇన్సూరెన్స్ సంస్థల్లో 49 శాతంగా ఉన్న ఎఫ్డీఐ పరిమితి.. 74 శాతానికి పెరుగనున్నది. కాగా, బీమా సంస్థలు అదనపు నిధులను సమీకరించుకోవడానికి, ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి పెరిగిన ఎఫ్డీఐ పరిమితి ఎంతో దోహదం చేయగలదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో చర్చ సందర్భంగా అన్నారు.