న్యూఢిల్లీ, జూన్ 7: బిస్కట్లు, స్నాక్స్ తయారీ దిగ్గజం పార్లే.. గోధుమపిండి వ్యాపారంలోకి అడుగుపెట్టింది. ‘పార్లే జీ చక్కీ ఆటా’ పేరుతో మార్కెట్లోకి వస్తున్నామని సంస్థ ప్రకటించింది. 2 కిలోల ప్యాకెట్ ధర రూ. 102గా, 5 కి లోల ధర రూ.245 గా, 10 కిలోలు రూ.450గా నిర్ణయించామని ఈ సందర్భంగా పార్లే ఉత్పత్తుల విభాగాధిపతి మయాంక్ షా తెలిపారు. అత్యంత నాణ్యమైన గోధుమలతో పిండిని మార్కెట్కు పరిచయం చేస్తున్నామన్న ప్రత్యర్థి సంస్థలకు గట్టి పోటీనివ్వగలమన్న ధీమాను వ్యక్తం చేశారు. ఉత్తర, పశ్చిమాది రాష్ర్టాల్లో తొలుత అందుబాటులోకి వస్తున్న ఈ గోధుమపిండిని.. దశలవారీగా దేశవ్యాప్తంగా తీసుకురానున్నారు.