దోహా: భారత స్టార్ క్యూయిస్టు పంకజ్ అద్వానీ..మరోమారు తన సత్తాచాటాడు. రికార్డు స్థాయిలో 24వ సారి ప్రపంచ టైటిల్తో మెరిశాడు. మంగళవారం జరిగిన ఐబీఎస్ఎఫ్ సిక్స్ రెడ్ స్నూకర్ ప్రపంచ చాంపియన్షిప్ ఫైనల్లో అద్వానీ..పాకిస్థాన్కు చెందిన బాబర్ మాసిపై అద్భుత విజయం సాధించాడు. స్వల్ప వ్యవధిలో దేశానికి రెండు టైటిళ్లు అందించడం చాలా గర్వంగా ఉందని అద్వానీ పేర్కొన్నాడు.