రాష్ట్రంలో ఊర్జా ప్లాంట్!

రూ.100 కోట్లతో ఏర్పాటు
రెండేండ్లలో అందుబాటులోకి యూనిట్
హైదరాబాద్: ఊర్జా క్లీన్టెక్ హైదరాబాద్లో కొత్త ప్లాంట్ను నెలకొల్పడానికి సిద్ధమవుతున్నది. ఫ్యాబ్సిటీ దగ్గరలో రూ. 50 కోట్ల నుంచి రూ.100 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ యూనిట్.. వచ్చే రెండేండ్లలో అందుబాటులోకి రానున్నట్లు కంపెనీ వ్యవస్థాపక ఎండీ మధుసూధన్ రావు తెలిపారు. ప్రస్తుతం చర్లపల్లి యూనిట్లో కొన్ని విడిభాగాలను తయారు చేసున్నామని, మరికొ న్నింటిని జర్మనీ నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు చెప్పారు. తాము తయారు చేసే పరికరాల వినిమయంతో విద్యుత్ బిల్లులను 30 శాతం నుంచి 90 శాతం వరకు తగ్గించుకోవచ్చని తెలిపారు. కాగా, ప్రస్తుతం భారత్లో 25 గిగావాట్లుగా ఉన్న విద్యుత్ వినిమయం వచ్చే 30 ఏండ్లలో 850 గిగావాట్లకు పెరుగుతుందని అంచనా. ఈ నేపథ్యంలో ఊర్జా క్లీన్టెక్ ఉత్పత్తులకు మార్కెట్లో భారీ డిమాండ్ కనిపించనున్నది.
తాజావార్తలు
- వీడియో : కబడ్డీ ఆడిన నగరి ఎమ్మెల్యే రోజా
- మెదక్ జిల్లాలో మహిళపై యాసిడ్ దాడి
- గుర్రంపై అసెంబ్లీకి వచ్చిన మహిళా ఎమ్మెల్యే
- మేఘన్కు సెరెనా విలియమ్స్ మద్దతు
- కోటాపై 50 శాతం పరిమితి : పున:సమీక్షించాలన్న సుప్రీంకోర్టు!
- నేనలా అనలేదు.. మీడియాలో తప్పుగా వచ్చింది: సీజే బొబ్డే
- హిందుస్థాన్ పెట్రోలియంలో ఇంజినీర్ పోస్టులు
- మహిళా దినోత్సవం : మగువలకు టెక్ దిగ్గజం బాసట!
- ఆరోగ్య కారణాలంటూ అభ్యర్థినిని తప్పించిన టీఎంసీ
- చట్ట వ్యతిరేక చర్యలను ప్రభుత్వం సహించదు : మంత్రి కేటీఆర్