న్యూఢిల్లీ: కరోనా రెండోవేవ్ను కట్టడి చేయడానికి పాక్షిక లాక్డౌన్ విధించడం వల్ల కార్మికులు, వస్తువుల రవాణాపై గణనీయ ప్రభావం పడనున్నది. ఈ సంగతి కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) నిర్వహించిన సీఈవోలో సర్వేలో తేలింది.
కరోనా కర్ఫ్యూ, మైక్రో కంటైన్మెంట్ వ్యూహాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయ తలపెట్టిన విధానాల ప్రభావంపై వివిధ సంస్థల సీఈవోలతో సీఐఐ సర్వే జరిపింది. 56 శాతం మంది సీఈవోలు వస్తువుల ఉత్పత్తిపై ప్రభావం పడుతుందని పేర్కొన్నారు.
కార్మికుల కదలికలు కూడా కష్టమేనని సీఈవోలు అభిప్రాయ పడ్డారు. ఆంక్షలు విధించడానికి బదులు 45 ఏండ్లు దాటిన ప్రతి ఒక్కరికి సామూహికంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టాలని 67 శాతం మంది సీఈవోలు వ్యాఖ్యానించారు.
ఆరోగ్య పరిరక్షణ, సేఫ్టీ ప్రొటోకాల్స్కు కఠిన ఆంక్షలు అవసరం అంటూనే వాటి అమలును ఇండస్ట్రీ, కామర్స్ రోజువారీ కార్యక్రమాలకు విస్తరించకూడదని అభిప్రాయ పడ్డారని సీఐఐ అధ్యక్షుడిగా ఎన్నికైన టీవీ నరేంద్రన్ పేర్కొన్నారు.
బెంగాల్లో కేంద్ర హోంమంత్రి పర్యటన