రూ.18 వేల వరకు తగ్గిన ధర
న్యూఢిల్లీ, జూన్ 16: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారు ఒకినవా..కొనుగోలుదారులకు శుభవార్తను అందించింది. కంపెనీకి చెందిన అన్ని రకాల వాహన ధరలను రూ.18 వేల వరకు తగ్గిస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. సంస్థ తీసుకున్న తాజా నిర్ణయంతో వాహన ధరలు రూ.7,209 నుంచి రూ.17,892 వరకు తగ్గనున్నాయి. ఫేమ్-2 పాలసీలో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేయడంతో వాహన ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో రూ.1,17,600గా ఉన్న ప్రైజ్+ఎలక్ట్రిక్ స్కూటర్ రూ.99,708కి తగ్గనుండగా, ప్రైజ్ ప్రొ కూడా రూ.7,947 తగ్గి రూ.76,848కి తగ్గనున్నది.