గుండాల, జూలై 9: టీఆర్ఎస్ పార్టీ… కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటుందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. మండలంలోని సు ద్దాల గ్రామంలో 6నెలల క్రితం ప్రమాదవశాత్తు చెరువులో పడి చనిపోయిన టీఆర్ఎస్ కార్యకర్త గూడ సోమయ్య కుటుంబాని కి శుక్రవారం హైదరాబాద్లోని మినిస్టర్స్ క్వార్టర్స్లో 2 లక్షల విలువైన పార్టీ ప్రమాద బీమా చెక్కును అందజేశారు. ఈ సంద ర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీ ఆర్ పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు ఇబ్బంది కలుగకూడదనే ఉద్దేశంతో పార్టీ ప్రమాద బీమాను అందజేస్తున్నారని, ప్రమా దవశాత్తు కార్యకర్త మరణిస్తే కుటుంబం వీధిలో పడకూడదనే గొప్ప ఆలోచన చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ కోఆ ప్షన్ సభ్యుడు ఖలీల్, టీఆర్ఎస్ లీగల్ సెల్ నాయకులు రహీం, రైతుబంధు సమితి మండల కన్వీనర్ పాండరి, మండలాధ్యక్షు డు దశరథ, ప్రధాన కార్యదర్శి మహోదయ్, నాయకులు మాధ వరెడ్డి, రాములు, మధు, రవి తదితరులు పాల్గొన్నారు.
కుటుంబాన్ని ఆదుకుంటాం
తుర్కపల్లి: కరోనాతో మృతి చెందిన బూడిద నర్సింహ కుటుం బానికి అన్ని విధాలుగా అండగా ఉంటూ ఆర్థికంగా ఆదుకుం టానమని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతారెడ్డి అన్నారు. మండలంలోని రుస్తాపూర్ గ్రామానికి చెందిన బూడి ద నర్సింహ ఇటీవల కరోనాతో మృతి చెందాడు. అతనికి భార్య ముగ్గురు ఆడ పిల్లలు ఉన్నారు.ఈ క్రమంలో శుక్రవారం వారు ప్రభుత్వ విప్ను కలువగా ఇద్దరు ఆడ పిల్లలను ప్రభుత్వం తర పున చదివిస్తానని, స్వయం ఉపాధి కోసం పేపర్ ప్లేట్మిషన్ ను ఇప్పిస్తానని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా రెడ్డి హామీ ఇచ్చి నట్లు జ్యోతి తెలిపింది. తమను అన్ని విధాలుగా ఆదుకుంటా మని చెప్పడంతో ప్రభుత్వ విప్కు జ్యోతి సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ర్యాకల రమేశ్యాదవ్, వెంకటేశ్, జహాంగీర్ తదితరులు పాల్గొన్నారు.