నమస్తే తెలంగాణ జ్యోతినగర్, ఆగస్టు 28: ఐఎస్వో 50001 ప్రమాణాలను విజయవంతంగా అమలు చేసిన రామగుండం ఎన్టీపీసీకి 2021 సంవత్సరానికి గానూ నేషనల్ ఎనర్జీ లీడర్ అవార్డు లభించింది. వర్చువల్ మోడ్ ద్వారా దేశవ్యాప్తంగా ఈ నెల 24 నుంచి 27 వరకు భారతీయ పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) 22వ ఎక్స్లెన్సీ, ఎనర్జీ జాతీయ అవార్డుల పోటీని నిర్వహించింది. ఇందులో భాగంగా ఎన్టీపీసీ అధికారుల బృందం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఐఎస్ఓ ప్రమాణాల్ల్లో ఎనర్జీ ఎఫీషియెన్సీ, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎనర్జీ మేనేజ్మెంట్లో చేపడుతున్న విధానాలను వివరించింది. ఈ క్రమంలో రామగుండం ఎన్టీపీసీకి ఈ అవార్డును ప్రకటించి శనివారం వర్చువల్ విధానంలో ప్రదానం చేసింది.