న్యూఢిల్లీ, జూలై 2: సాధారణ వ్యాధుల చికిత్స కోసం అధికంగా వినియోగించే మూడు కీలక ఔషధాల ధరల పెంపునకు నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్పీపీఏ) ఆయా కంపెనీలను అనుమతించింది. కార్బమజిపైన్, రానిటిడైన్, ఐబుప్రొఫెన్ డ్రగ్స్ ప్రథమ చికిత్సకు ఉపయోగించేవి అయినందున వాటి నిరంతర లభ్యత దేశంలో ప్రజారోగ్య కార్యక్రమానికి అవసరమని ఎన్పీపీఏ ఉత్తర్వుల్లో పేర్కొంది. ధరల నియంత్రణ పరిధిలో ఉన్న వీటి ధరల్ని పెంచకపోతే, మార్కెట్లో వీటి లభ్యత కరువై, ప్రజలు ఖరీదైన ప్రత్యామ్నాయ ఔషధాలవైపు మళ్లాల్సి వస్తుందని అథారిటీ వివరించింది.