న్యూఢిల్లీ: కరోనా నియంత్రణకు విధించిన లాక్డౌన్లను రాష్ట్ర ప్రభుత్వాలు సడలించడంతో రవాణా సేవలు పుంజుకున్నాయి. తదనుగుణంగా పెట్రోల్, డీజిల్ వినియోగం పెరిగింది. దీంతో గత నెలలో పెట్రోలియం ఉత్పత్తుల వినియోగం డిమాండ్ పుంజుకున్నది. తొమ్మిది నెలల కనిష్ఠంతో నమోదైన మే వినియోగంతో పోలిస్తే జూన్ నెలలో పెరిగింది.
మే నెలతో పోలిస్తే జూన్ నెలలో 8 శాతం ఫ్యూయల్ డిమాండ్ పుంజుకున్నది. గత నెలలో 16.34 మిలియన్ టన్నుల ఇంధన వినియోగం జరిగిందని కేంద్ర చమురు మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలసిస్ సెల్ (పీపీఏసీ) తెలిపింది.
కరోనా రెండో వేవ్ వల్ల లాక్డౌన్, ఇతర ఆంక్షలు అమలులోకి తేవడంతో ఆర్థిక లావాదేవీలు స్తంభించాయి. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో గతేడాది ఆగస్టు తర్వాత అతి తక్కువగా మే నెలలో ఇంధన వినియోగం జరిగింది.
జూన్ నెలలో ఇంధన వినియోగం గతేడాదితో పోలిస్తే 1.5 శాతం పెరిగింది. దేశీయ రిఫైండ్ ఫ్యూయల్ సేల్స్లో సుమారు 40 శాతం ఉన్న డీజిల్ వనిఇయోగం మే నెలలో 1.6 శాతం తగ్గి 6.20 మిలియన్ టన్నులకు చేరుకుంది. కానీ జూన్ నెలలో 12 శాతం పెరిగింది.
గతేడాదితో పోలిస్తే జూన్ నెలలో పెట్రోల్ వాడకం 5.7 శాతం పెరిగింది. మే నెలతో పోలిస్తే 21 శాతం పెరిగి 2.41 మిలియన్ టన్నులకు చేరుకున్నది. వంట గ్యాస్ వాడకం 9.7 శాతం పెరిగి 2.26 మిలియన్ టన్నుల వద్ద స్థిర పడింది. కానీ నాఫ్తా సేల్స్ 3.1 శాతం తగ్గి 1.19 మిలియన్ టన్నులకు పడిపోయింది.
బోనాల పండుగకు ముస్తాబైన భాగ్యనగరం.. బోనం అంటే ఏంటి? ఈ ఉత్సవాలు ఎప్పుడు మొదలయ్యాయి?
లేహ్ ఆందాల వీక్షణకు పోటెత్తిన టూరిస్టులు..!
పులిని వెంబడించిన ఎలుగుబంటి.. వీడియో వైరల్
మహమ్మారి ముప్పు తగ్గలేదు : WHO శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్
సినీ నటుడు కత్తి మహేశ్ మృతి
6 ఏళ్ల బాహుబలి… ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసిన ప్రభాస్
ఆషాఢంలో ఆడపిల్లలు గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి?
కప్పా వేరియంట్ గురించి ఏమీ చెప్పలేం : వైద్య నిపుణులు
రూ.10 లక్షల లోపు బెస్ట్ డీజిల్ కార్లు ..
త్వరలో భారత్ నుంచి దుబాయికి విమానాలు!
ఇంట్లో దూరి 21 పిల్లలు చేసిన నాగుపాము..!
భారత్ ఫారెక్స్ నిల్వలు.. ఎంత పెరిగాయంటే..!!
Crypto Investersకు షాక్.. విదేశాలకు నిధుల మళ్లింపుకు ఐసీఐసీఐ నో!