న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: ప్రభుత్వ రంగ మైనింగ్ కంపెనీ ఎన్ఎండీసీ ఇనుప ఖనిజం ధరల్ని భారీగా టన్నుకు రూ.1,000 మేర తగ్గించింది. ఇరన్ఓర్ లంప్స్ తాజా టన్ను ధరను రూ.6,150గా, ఇరన్ఓర్ ఫైన్స్ ధరను రూ.5,160గా నిర్ణయించినట్లు ఎన్ఎండీసీ తెలిపింది. ఈ ఏడాది ఆగస్టు 7న లంప్స్ ధరను 7,150గా, ఫైన్స్ ధరను రూ.6,150గా సవరించింది. ఆ ధరలతో పోలిస్తే తాజాగా టన్నుకు రూ.1,000 వరకూ తగ్గించినట్లయ్యింది. కొత్త ధరలు సెప్టెంబర్ 4 నుంచి అమలులోకి వచ్చినట్లు కంపెనీ వెల్లడించింది.