న్యూఢిల్లీ, మార్చి 23: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్)లో తమ విరాళాలపై ఉద్యోగులు పొందే వడ్డీ ఆదాయానికి పన్ను మినహాయింపు పరిమితిని కేంద్రం పెంచింది. ఏటా రూ.5 లక్షలకు పెంచుతున్నామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్సభలో ఆర్థిక బిల్లు 2021పై చర్చ సందర్భంగా ప్రకటించారు. అయితే ఇది పేర్కొన్న కేసులకే వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఈపీఎఫ్లో సదరు ఉద్యోగి సంస్థకు ప్రాతినిథ్యం లేకపోతేనే ఈ ప్రయోజనం అందుతుందని చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2021-22)గాను గత నెల పార్లమెంట్లో ప్రకటించిన బడ్జెట్లో దీన్ని రూ.2.5 లక్షలుగానే మంత్రి ప్రతిపాదించారు. అయితే మరింత మందికి లబ్ధి చేకూరాలన్న ఉద్దేశంతో ఈ పరిమితి పెంచామని నిర్మల చెప్పారు. మరోవైపు ఆర్థిక బిల్లును లోక్సభ ఆమోదించింది.