Nirmala Sitaraman | రెట్రోస్పెక్టివ్ టాక్స్ చట్టం ఉపసంహరించడంతోపాటు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక సంస్కరణలను జో బిడెన్ సారధ్యంలోని అమెరికా సర్కార్, అమెరికా కంపెనీలు స్వాగతిస్తున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఆర్థిక సంస్కరణల అమలులో భారత ప్రభుత్వం చాలా సానుకూల నిర్ణయం తీసుకున్నదని బిడెన్ సర్కార్ పేర్కొన్నదన్నారు. వారం రోజులుగా అమెరికాలో పర్యటిస్తున్న సీతారామన్ శుక్రవారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ పై విధంగా చెప్పారు. రెట్రోస్పెక్టివ్ టాక్స్ చట్టం ఉపసంహరణ చాలా సాహసోపేతమై నిర్ణయం అని అమెరికా కార్పొరేట్లు కొనియాడారన్నారు.
కార్పోరేట్ సంస్థలు 50 ఏండ్ల క్రితం పొందిన క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ విధిస్తూ ఇంతకుముందు కేంద్రం చేసిన చట్టాన్ని రద్దు చేస్తూ గత ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం బిల్లును ఆమోదించింది. విదేశీ కార్పొరేట్ సంస్థల నుంచి రెట్రోస్పెక్టివ్ టాక్స్ వసూలు చేసినందుకు.. ఆయా సంస్థలు.. ఇతరదేశాల్లోని భారత్ ఆస్తులు న్యాయవివాదంలో చిక్కుకోవడంతో కేంద్రం సదరు చట్టాన్ని విత్డ్రా చేసింది. తదనుగుణంగా వసూలు చేసిన టాక్స్ మొత్తం రీఫండ్ చేస్తామని కేంద్రం ప్రకటించింది.