ముంబై, ఆగస్టు 26: దేశీయ స్టాక్ మార్కెట్ల రికార్డుల పరంపర కొనసాగుతున్నది. ఇంట్రాడేలో రికార్డు స్థాయికి దూసుకుపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ వరుసగా రెండోరోజు ఫ్లాట్గా ముగిశాయి. నెలవారీ డెరివేటీవ్ కాంట్రాక్టు గడువు ముగియనుండటం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలతో సూచీ తీవ్ర ఒడిదుడుకులకు గురైంది. ఫలితంగా సెన్సెక్స్ కేవలం 4.89 పాయింట్లు పెరిగి 55,949.10 వద్ద ముగియగా..జాతీయ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ రికార్డు స్థాయిలో దూసుకుపోయంది. మార్కెట్ ముగిసే సమయానికి నిఫ్టీ 2.25 పాయింట్లు బలపడి 16,636.80 వద్ద స్థిరపడింది. మార్కెట్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ అత్యధికంగా లాభపడి టాప్ గెయినర్గా నిలిచింది. దీంతోపాటు మహీంద్రా, హెచ్సీఎల్ టెక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్యూఎల్, నెస్లేల షేర్లను మదుపరులు ఆకట్టుకోకపోగా..భారతీ ఎయిర్టెల్, మారుతి, పవర్గ్రిడ్, ఎస్బీఐ, టాటా స్టీల్, ఎన్టీపీసీ, సన్ఫార్మాల షేర్లు నాలుగు శాతానికి పైగా లాభపడ్డాయి. రంగాలవారీగా చూస్తే ఎనర్జీ, పవర్, ఆయిల్ అండ్ గ్యాస్, క్యాపిటల్ గూడ్స్, ఎఫ్ఎంసీజీ, ఇండస్ట్రీయల్ రంగ షేర్లు ఒక్కశాతానికి పైగా పెరుగగా..టెలికం, మెటల్, బేసిన్ మేటిరియల్, టెక్ రంగ షేర్లు కుదేలయ్యాయి.మరోవైపు, డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 2 పైసలు పెరిగి 74.22కి చేరుకున్నది.