న్యూఢిల్లీ, నవంబర్ 26: మళ్లీ ఐపీవోల సందడి నెలకొన్నది. దేశ ఆర్థిక పరిస్థితులు ఆశాజనకంగా ఉండటంతో స్టాక్ మార్కెట్లో లిస్ట్ కావడానికి చిన్న స్థాయి సంస్థలు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు ఎల్ఐసీతోపాటు డెలివరీతో కలుపుకొని రూ.30 వేల కోట్ల స్థాయిలో నిధులను సమీకరించాయి. నవంబర్ నెలలో ఇప్పటి వరకు ఎనిమిది సంస్థలు రూ.9,500 కోట్ల నిధులను సేకరించాయి. ఇదే క్రమంలో వచ్చేవారంలో రెండు సంస్థలు రూ.1,000 కోట్ల వరకు నిధులను సమీకరించబోతున్నాయి. వీటిలో ధర్మాజ్ క్రాప్ గార్డ్, యునిపార్ట్స్ ఇండియాలు ఉన్నాయి. ఇప్పటికే గ్లోబల్ హెల్త్, ఫైవ్స్టార్ బిజినెస్ ఫైనాన్స్, అర్కెమ్ కెమికల్ ఇండస్ట్రీస్, ఫ్యూజన్ మైక్రో ఫైనాన్స్లు ఐపీవోకి వచ్చాయి.