ఢిల్లీ, సెప్టెంబర్ 21: యమహా మోటర్ ఇండియా.. దేశీయ మార్కెట్లోకి సరికొత్త ద్విచక్ర వాహనాలను విడుదల చేసింది. ఆల్-న్యూ 155సీసీ స్కూటర్ మోడల్ ఏరోక్స్ 155తోపాటు వైజెడ్ఎఫ్-ఆర్15 155సీసీ అప్డేటెడ్ వెర్షన్ బైక్ను తీసుకొచ్చింది. ఢిల్లీ ఎక్స్షోరూం ప్రకారం ఏరోక్స్ 155 ధర 1.29 లక్షలుగా ఉన్నది. వైజెడ్ఎఫ్-ఆర్15 ప్రారంభ ధర 1.67 లక్షలు గా ఉన్నది. ఈ కొత్త టూవీలర్లతో తమ కస్టమర్లు నూతన అనుభవాన్ని పొందగలరన్న విశ్వాసాన్ని కంపెనీ చైర్మన్ మోటోఫుమి షితారా వ్యక్తం చేశారు.