Tata EV Sedan Tigor | దేశీయ ఆటోమొబైల్ మేజర్ టాటా మోటార్స్ త్వరలో ఎలక్ట్రిక్ సెడాన్ టైగోర్ కారును విపణిలో ఆవిష్కరించనున్నది. ఇటీవలి వరకు దేశీయ మార్కెట్లో సుదీర్ఘ కాలంగా అత్యధికంగా అమ్ముడవుతున్న టైగోర్ ఈవీని ట్యాక్సీ సర్వీసులకు వాడుతున్నారు. తాజాగా విడుదల కానున్న టాటా టైగోర్ ఎలక్ట్రిక్ సెడాన్ టాటా ఎక్స్ప్రెస్ టీ పేరిట ఆవిష్కరిస్తున్నారు. పర్సనల్ యూజర్లను లక్ష్యంగా చేసుకుని ఎక్స్ప్రెస్ టీ సెడాన్ మోడల్ కారును టాటా మోటార్స్ తీసుకొస్తున్నది.
జిప్ట్రాన్ టెక్నాలజీతో టైగోర్ ఈవీ అలియాస్ టాటా ఎక్స్ ప్రెస్ టీ కారు సింగిల్ చార్జింగ్తో 300 కి.మీ. పైగా ప్రయాణిస్తుంది. దీని ధర రూ.10 లక్షల నుంచి ప్రారంభం అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇటీవలే టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ స్పందిస్తూ 2025 నాటికి 10 న్యూ బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్స్ను స్వదేశీ పరిజ్ఞానంతో ఆవిష్కరిస్తామన్నారు.
ఫ్లీట్ కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని ఎక్స్ప్రెస్ బ్రాండ్ ను ఆవిష్కరించింది టాటా మోటార్స్. ప్యాసింజర్ సేఫ్టీ, ప్యాసింజర్ సౌకర్యం, తక్కువ ధరకే అందుబాటులో ఉంటుంది ఎక్స్ప్రెస్ బాండ్. ఇక నుంచి ఫ్లీట్ సెగ్మెంట్లోని అన్ని వెహికిల్స్కు ఎక్స్ ప్రెస్ బ్యాడ్జ్ వాడతారు.
దేశీయ మార్కెట్లో ప్రస్తుతం రెండు ఎలక్ట్రిక్ కార్లను టాటా మోటార్స్ విక్రయిస్తున్నది. వాటిల్లో బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ వెహికల్గా టాటా నెక్సన్ ఈవీ నిలిచింది. అత్యధికంగా ప్రభుత్వం, రవాణా సేవలకు ఉపయోగిస్తున్న కారు టాటా టైగోర్ ఈవీ. టైగోర్ ఈవీ మాదిరిగానే టాటా ఎక్స్ప్రెస్ టీ సెడాన్ కారు కూడా మొబిలిటీ సర్వీసెస్, కార్పొరేట్, ఫ్లీట్ సేవల కోసం ఉపయోగించనున్నారు.