న్యూఢిల్లీ, ఆగస్టు 10:దేశీయ మార్కెట్లోకి సరికొత్త సఫారీ, ఫ్లాగ్షిప్ ఎస్యూవీ హారియర్ను విడుదల చేసింది టాటా మోటర్స్. నూతన ఫీచర్స్తో రూపొందించిన ఈ మోడళ్ళలో ఆరు-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, పానోరామిక్ సన్రూఫ్ వంటివి ఉన్నాయి.
వీటిలో రూ.19.14 లక్షల విలువైన హారియర్ ఎక్స్టీఏ ప్లస్, రూ.19.34 లక్షల ధర కలిగిన హారియర్ ఎక్స్టీఏ ప్లస్, సఫారీ ఎక్స్టీఏ ప్లస్ ధర రూ.19.34 లక్షలుగా నిర్ణయించింది. ఈ ధరలు ఢిల్లీ షోరూంనకు సంబంధించినవి.