న్యూఢిల్లీ, జూన్ 7: ఆదాయం పన్ను (ఐటీ) శాఖ ‘ఈ-ఫైలింగ్ 2.0’ను www. incometax.gov.in ప్రారంభించింది. ఈ కొత్త పోర్టల్ ద్వారా ఆన్లైన్లో ఐటీ రిటర్నులు, పన్ను చెల్లింపులు మరింత సులభం కానున్నాయి. ఒక్కసారి నమోదిత యూజర్ పోర్టల్లోకి లాగిన్ అయితే డ్యాష్బోర్డులో వివరాలన్నీ కనిపించేస్తాయి. ‘మై ప్రొఫైల్’ మెనూ కింద వ్యక్తిగత వివరాలనూ మార్చుకోవచ్చు. అయితే డీఎస్సీను ట్యాక్స్పేయర్లు మళ్లీ నమోదు చేసుకోవాల్సి ఉంటుందని ఈ సందర్భంగా ఐటీ శాఖ స్పష్టం చేసింది. అంతేగాక ‘ప్రైమరీ కాంటాక్ట్’ కింద వ్యక్తిగత మొబైల్ నెంబర్ను, ఈమెయిల్ ఐడీలను కూడా అప్డేట్ చేసుకోవాలని సూచించింది.
కొత్త పోర్టల్ ప్రత్యేకతలు