కొత్త ఫార్చ్యూనర్.. ప్రారంభ ధర రూ.29.98 లక్షలు

న్యూఢిల్లీ, జనవరి 6: టయోటా కిర్లోస్కర్ దేశీయ మార్కెట్లోకి ప్రీమియం ఎస్యూవీ ఫార్చ్యూనర్లో సరికొత్త వెర్షన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఢిల్లీ షోరూంలో ఈ వాహనం రూ.29.98 లక్షల నుంచి రూ.37.43 లక్షల మధ్యలో లభించనున్నది. 2.8 లీటర్ల డీజిల్ ఇంజిన్ కలిగిన ఈ నూతన ఫార్చ్యూనర్లో 6-స్పీడ్ ఆటోమేటిక్, 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 2.7 లీటర్ల పెట్రోల్ ఇంజిన్ కలిగిన కారులో 6-స్పీడ్ ఆటోమేటిక్, 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ కలిగివున్నాయి. ఈ ఫార్చ్యూనర్లో 11 జేబీఎల్ ఆడియో స్పీకర్లు, సీట్ వెంటిలేషన్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో/యాపిల్ కార్ప్లే కనెక్టివిటీ, రియల్-టైమ్ ట్రాకింగ్, లాస్ట్ పార్క్ లోకేషన్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. దీంతోపాటు రూ.37.58 లక్షల విలువైన లెజెండర్ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. 2009లో దేశీయ మార్కెట్లోకి అడుగుపెట్టిన ఈ ఫార్చ్యూనర్ కారు ఇప్పటి వరకు 1.7 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి.
తాజావార్తలు
- వీడియో : పెద్దగట్టు జాతర
- రానా తమ్ముడు హీరోగా వచ్చేస్తున్నాడు!
- రూ.45వేల దిగువకు బంగారం ధర.. అదేబాటలో వెండి
- రియల్టర్ దారుణం : పెండ్లి పేరుతో కూతురు వయసున్న మహిళపై లైంగిక దాడి!
- వెంకీ-మీనా ‘దృశ్యం 2’ షురూ అయింది
- కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెంచేది లేదు : ఇఫ్కో
- ఇంటి రుణంపై రూ.4.8 లక్షల ఆదా.. ఎలాగంటే..!
- రియల్టర్ నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎంపీవో
- కొత్త కారు కొంటున్న జూనియర్ ఎన్టీఆర్.. ధరెంతో తెలుసా?
- ఒకే ప్రాంతం..ఒకే రోజు.. 100 సఫారీలు డెలివరీ