న్యూఢిల్లీ: వంట గ్యాస్ ధర భారం తగ్గించేందుకు ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ సంస్థ పేటీఎం మరోసారి ముందుకు వచ్చింది. ఐవీఆర్ ద్వారా గానీ, పేటీఎం ద్వారా వాట్సాప్ ద్వారా గానీ, మిస్డ్ కాల్తో గానీ బుక్ చేసుకోవచ్చు. సిలిండర్ బుక్ చేసుకున్న కొన్ని గంటల తర్వాత పేటీఎం ద్వారా బిల్లు చెల్లించొచ్చు.
పేటీఎం యాప్ ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుంటే రూ.900 వరకు అదనంగా అద్భుతమైన క్యాష్ బ్యాక్ ఆఫర్ చేస్తున్నది. ఇప్పుడు 3 సిలిండర్లు బుక్ చేసుకోవచ్చు. ఇంతకుముందు తొలిసారి బుక్ చేసుకున్న వారికే పేటీఎం ఆఫర్ చేసింది.
క్యాష్ బ్యాక్తోపాటు పేటీఎం ఫస్ట్ పాయింట్స్ మీ వాలెట్ బ్యాలెన్స్లో చేరతాయి. భారత్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్, హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ సంస్థల్లో సిలిండర్ బుక్ చేసుకున్న వారికి ఈ క్యాష్ బ్యాక్ లభిస్తుంది.
పేటీఎం ద్వారా గ్యాస్ సిలిండర్ డెలివరీ స్టేటస్ను ట్రాక్ చేయొచ్చు. పేటీఎం పోస్ట్ పెయిడ్ ఎన్రోల్ చేసుకోవచ్చు.. సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత కూడా పేటీఎం ద్వారా కస్టమర్లు చెల్లింపుల ఆప్షన్ పొందొచ్చు.
ఈ ఆఫర్తో లబ్ధి పొందడం ఎలా..
పేటీఎం యాప్ హోం పేజీకి వెళ్లి మోర్ ఆప్షన్పై టాప్ చేయాలి. ఎడమ వైపున ఉన్న కాలంలోని రీచార్జి, పేబిల్స్ ఆప్షన్ను ఎంచుకోవాలి. అటుపై సిలిండర్ ఐకాన్ను బుక్ చేసుకోవాలి.
మీ గ్యాస్ సిలిండర్ ప్రొవైడర్ను ఎంపిక చేయాలి. భారత్ గ్యాస్, ఇండేన్ గ్యాస్, హెచ్పీ గ్యాస్ సంస్థలు వంట గ్యాస్ సిలిండర్లు సరఫరా చేస్తున్నాయి.
గ్యాస్ ప్రొవైడర్ను ఎంచుకున్న తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ ఫోన్ నంబర్ లేదా ఎల్పీజీ ఐడీ నంబర్ లేదా కస్టమర్ నంబర్ నమోదు చేయాలి. ఆ తర్వాత బటన్ నొక్కి.. చెల్లింపులు పూర్తి చేయాలి. మీరు ఇచ్చిన చిరునామాలో గ్యాస్ సిలిండర్ డెలివరీ అవుతుంది.