హైదరాబాద్, ఆగస్టు 9: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.3,350.91 కోట్ల టర్నోవర్పై రూ.129. 64 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్లు ఎన్సీసీ ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.2,083.21 కోట్ల ఆదాయంతో పోలిస్తే 61 శాతం అధికమైంది. స్టాండ్లోన్ విషయానికి వస్తే రూ.2,989.73 కోట్ల ఆదాయంపై రూ.120.03 కోట్ల లాభాన్ని గడించింది. తొలి త్రైమాసికంలో సంస్థ రూ.4,456 కోట్ల విలువైన ఆర్డర్లు వచ్చాయి. దీంతో సంస్థ వద్ద ప్రస్తుతం రూ.40,616 కోట్ల విలువైన ఆర్డర్లు ఉన్నాయి.