కొలంబో, ఏప్రిల్ 24: శ్రీలంకలో మరింత ప్రమాదకరమైన కొత్తరకం కరోనాను (కొత్త స్ట్రెయిన్ను) గుర్తించారు. ఇది శ్రీలంకలో ఇప్పటిదాకా గుర్తించిన స్ట్రెయిన్ల కంటే వేగంగా వ్యాప్తి చెందుతున్నది. గంట వరకు గాలిలో ఉంటున్నది. శ్రీలంలో గత వారం జరిగిన కొత్త సంవత్సరం వేడుకల తర్వాత నుంచి కొత్త స్ట్రెయిన్ వ్యాప్తి ఉద్ధృతంగా ఉందని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఎక్కువగా యువత దాని బారిన పడుతున్నారు. ఇది రానున్న 2 వారాల్లో కరోనా మూడో దశ ఉద్ధృతికి దారితీయవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తుంపర్లలో కరోనా కొత్త స్ట్రెయిన్ గంట వరకు గాలిలో ఉంటున్నదని గుర్తించామని శ్రీలంక ఇమ్యునాలజీ, మాలిక్యులర్ సైన్సెస్ విభాగం చీఫ్ నీలికా మలవిగే తెలిపారు. మరోవైపు. కరోనా కట్టడికి శ్రీలంక ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.