లక్నో : ప్రియుడితో సరసాల్లో మునిగి తేలుతున్న ఓ తల్లి తన కూతురి పట్ల క్రూరంగా ప్రవర్తించింది. కుటుంబం కంటే ప్రియుడే ముఖ్యమని భావించిన ఆమె తన కూతురిని చంపింది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలిలో మంగళవారం వెలుగు చూసింది.
సుర్సానా గ్రామానికి చెందిన రేణుతో బాల్భద్రాపూర్ వాసి సంతోష్కు ఐదేళ్ల క్రితం వివాహమైంది. అయితే వీరికి ప్రస్తుతం ఐదేళ్ల కూతురు ఉంది. గత నెలలో హోలీ పండుగ రోజున తన పుట్టింటికి పాపతో కలిసి రేణు వెళ్లింది. అక్కడున్న సచిన్ యాదవ్తో ఆమె గత ఏడాది కాలం నుంచి వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. ఇక పుట్టింటికి వెళ్లిన రేణు.. సచిన్ ఇంట్లోనే మకాం వేసింది. ఈ విషయాన్ని గమనించిన చిన్నారి.. నాన్నకు చెప్తానని తల్లికి చెప్పింది. దీంతో ఆ చిన్నారిని తన ప్రియుడితో కలిసి బావిలో పడేసి హత్య చేసింది.
అత్తారింటికి రాకపోవడంతో ఫిర్యాదు
హోలీ పండుగకు వెళ్లిన రేణు మార్చి 31న తిరిగి అత్తారింటికి రావాల్సి ఉండే. కానీ ఆమె తిరిగి రాలేదు. కూతురు కూడా కనబడటం లేదని సంతోష్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా అసలు విషయం వెలుగు చూసింది. పోలీసుల దర్యాప్తులో రేణు తన నేరాన్ని అంగీకరించింది. సచిన్తో ఏకాంతంగా ఉన్న సమయంలో తన కూతురు చూసి తండ్రికి చెప్తానని చెప్పింది. ఈ క్రమంలోనే సచిన్ సహాయంతో చిన్నారిని హత్య చేసినట్లు అంగీకరించింది.
ఇవికూడా చదవండి..