ముంబై, జూలై 13: ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ యాజమాన్యాన్ని జీవీకే గ్రూప్ నుంచి మంగళవారం అదాని గ్రూప్ టేకోవర్ చేసింది. ఈ మేరకు అదాని ఎంటర్ ప్రైజెస్ తెలిపింది. ముంబై విమానాశ్రయంలో జీవీకేకున్న 50.5% వాటాను, ఎయిర్పోర్ట్స్ కంపెనీ సౌతాఫ్రికా, బిడ్వెస్ట్ గ్రూప్లకున్న 23.5% వాటాను అదాని గ్రూప్ కొంటు న్నది. దీంతో ఈ లావాదేవీలు పూర్తయితే ఎయిర్పోర్టులో అదాని గ్రూప్ వాటా 74 శాతానికి చేరనున్నదని అదాని వర్గాలు ఓ ప్రకటనలో తెలియజేశాయి.