హైదరాబాద్ : స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ( SAAP ) మాజీ చైర్మన్, ఆంధ్రా రంజీ ప్లేయర్ పీఆర్ మోహన్ (72) సోమవారం ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న మోహన్.. చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తిలో తుదిశ్వాస విడిచారు. పీఆర్ మోహన్ క్రికెటర్తో పాటు యోగా నిపుణుడు కూడా. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్లో వివిధ పదవులను నిర్వర్తించారు. పలు టీమ్లకు కోచ్గా వ్యవహరించారు. పీఆర్ మోహన్ మృతిపట్ల పలువురు నాయకులు, క్రికెటర్లు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.