హైదరాబాద్, సెప్టెంబర్ 23: మూత్రపిండాల క్యాన్సర్ చికిత్స కోసం ఎంఎస్ఎన్ ల్యాబ్స్ ఓ జనరిక్ ఔషధాన్ని తీసుకొచ్చింది. క్యాబొలాంగ్ పేరుతో ఈ మందును మార్కెట్కు పరిచయం చేస్తున్నట్లు గురువారం ఈ హైదరాబాద్కు చెందిన ఫార్మా కంపెనీ ప్రకటించింది. ఇకపై తమ నూతన ఆంకాలజీ విభాగం.. దేశంలోని క్యాన్సర్ రోగులకు ప్రయోజనం చేకూరేలా చౌక ధరలకే అత్యంత నాణ్యమైన, బయో-ఈక్వాలెంట్ జనరిక్ క్యాన్సర్ డ్రగ్స్ను అందించడంపై దృష్టి పెడుతుందని ఓ ప్రకటనలో ఎంఎస్ఎన్ ల్యాబ్స్ తెలియజేసింది. క్యాబొలాంగ్ ఔషధం 20ఎంజీ/40ఎంజీ/60ఎంజీ మోతాదుల్లో లభ్యం అవుతుంది. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న విదేశీ దిగుమతి ఔషధాలతో చికిత్సకు లక్షల్లో ఖర్చు చేయాల్సి వస్తున్నదన్న ఎంఎస్ఎన్ ల్యాబ్స్.. తమ జనరిక్ మందులతో నెలసరి చికిత్స ఖర్చు రూ.10వేల లోపే ఉంటుందన్నది. కాగా, క్యాబొజంటినిబ్కు దేశంలోనే తొలి బ్రాండెడ్ జనరిక్గా వచ్చిన క్యాబొలాంగ్ ఔషధాన్ని యూఎస్ఎఫ్డీఏ, ఈయూజీఎంపీ వంటి ప్రముఖ గ్లోబల్ రెగ్యులేటరీ అథారిటీలు ఆమోదించిన తమ స్టేట్-ఆఫ్-ది-ఆర్ట్ ప్లాంట్లో తయారు చేస్తున్నట్లు ఈ సందర్భంగా ఎంఎస్ఎన్ ల్యాబ్స్ తెలియజేసింది.