అగ్ర నటులు షారుఖ్ఖాన్, సంజయ్దత్ తొలిసారి కలిసి ఓ సినిమా చేయబోతున్నారా? అంటే ఔననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. షారుఖ్ఖాన్ కథానాయకుడిగా వయాకామ్ 18 సంస్థ ‘రాఖీ’ పేరుతో ఓ బహుభాషా చిత్రాన్ని తెరకెక్కించబోతున్నది. పీరియాడికల్ యాక్షన్ కథాంశంతో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రంలో సంజయ్దత్ కీలక పాత్రలో నటించనున్నట్లు సమాచారం. షారుఖ్ఖాన్, సంజయ్దత్ కలిసి పూర్తి నిడివి ప్రధాన పాత్రల్లో నటించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. షారుఖ్ఖాన్ హీరోగా నటించిన ‘రా వన్’, ‘ఓం శాంతి ఓం’ చిత్రాల్లో సంజయదత్ అతిథి పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ముంబయిలో ఈ సినిమా చిత్రీకరణ సాగుతున్నట్లు తెలిసింది.