న్యూఢిల్లీ, జూన్ 23: దేశ జీడీపీ అంచనాలకు మూడీస్ కోత పెట్టింది. ఈ ఏడాది భారత్ వృద్ధిరేటు 9.6 శాతంగానే ఉండొచ్చని బుధవారం పేర్కొన్నది. గతంలో ఈ గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ 13.9 శాతంగా అంచనా వేయడం గమనార్హం. ఇక వచ్చే సంవత్సరం జీడీపీ 7 శాతంగా నమోదు కావచ్చన్నది. వ్యాక్సినేషన్ వేగవంతమే దేశ ఆర్థిక వ్యవస్థకు రక్షగా అభిప్రాయపడింది.