న్యూఢిల్లీ, మార్చి 4: తాజ్మహల్ భవనం కాంప్లెక్స్లో బాంబు పెట్టినట్టు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి గురువారం ఉదయం ఉత్తరప్రదేశ్ పోలీసులకు ఫోన్ వచ్చింది. అప్రమత్తమైన పోలీసులు ముందుజాగ్రత్తగా తాజ్మహల్ సందర్శనను నిలిపివేశారు. పర్యాటకులను బయటకు పంపి తాజ్మహల్ను మూసివేశారు. బాంబ్ స్కాడ్స్ తనిఖీలు నిర్వహించాయి. ఎక్కడా బాంబు దొరకలేదు. దీంతో కాల్ వట్టిదేనన్న నిర్ధారణకు వచ్చారు. కాల్ చేసిన వ్యక్తిని విమల్కుమార్ సింగ్గా గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. అతని మానసిక పరిస్థితి సరిగ్గా లేనట్టు తెలుస్తున్నది.