హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): కరోనా చికిత్సలో వినియోగించే మోల్నుపిరవిర్ను ఉత్పత్తి చేయనున్నట్టు హైదరాబాద్ దిగ్గజ ఫార్మా సంస్థ హెటిరో ప్రకటించింది. ఈ ఔషధం ఉత్పత్తి, మార్కెటింగ్కు తాము కెనడాకు చెందిన మెర్క్షార్ప్ అండ్ డోమ్ (ఎంఎస్డీ) బయోఫార్మాతో ఒప్పందం చేసుకున్నామని హెటిరో ఒక ప్రకటనలో వెల్లడించింది. మోల్నుపిరవిర్ ప్రస్తుతం మూడో దశ క్లినికల్ ట్రయల్స్లో ఉన్నది. ఈ ఔషధం వినియోగానికి అత్యవసర అనుమతులు రాగానే ఉత్పత్తిని ప్రారంభిస్తామని తెలిపింది. ఈ సందర్భంగా హెటిరో గ్రూప్ చైర్మన్ పార్థసారథిరెడ్డి మాట్లాడుతూ.. దేశం కరోనాతో పోరాడుతున్న సమయంలో మోల్నుపిరవిర్ను ఉత్పత్తి చేసి అందించడం సంతోషంగా ఉన్నదని, ఈ ఔషధం అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలని వెంటనే డీసీజీఐని కోరుతామని తెలిపారు.
ఆప్టిమస్ కూడా…
స్వల్ప, మధ్యస్త లక్షణాలతో ఉన్న కొవిడ్-19ను అదుపుచేసే ఔషధంగా పేర్కొంటున్న మోల్నుపిరవిర్పై మూడో దశ క్లినికల్ పరిక్షకు సిద్ధంగా ఉన్నట్లు హైదరాబాద్కు చెందిన ఆప్టిమస్ ఫార్మా సంస్థ ప్రకటించింది. ఈ మూడో దశ క్లినికల్ ట్రయల్స్కోసం సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనేజేషన్కు దరఖాస్తు చేసుకున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. మోల్నుపిరవిర్ ద్వారా చికిత్స అందించిన వారిలో కేవలం ఐదు రోజుల్లో సత్ఫలితాలు కనిపించనున్నాయని, నోటి ద్వారా అందించే చికిత్స కావడంతో రోగులకు ఇబ్బందులు తగ్గుతాయని కంపెనీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.