న్యూఢిల్లీ: భారతదేశంలో క్రిప్టో కరెన్సీ భవితవ్యం చుట్టూ పలు అనుమానపు నీలినీడలు కమ్ముకున్నాయి. కానీ, దేశంలో క్రిప్టో కరెన్సీ నియంత్రణపై విధి విధానాల నిర్ణయానికి భారత ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమిస్తుందన్న వార్తలతో క్రిప్టో ఇండస్ట్రీ సంతోషంగా ఉంది.
ఇప్పటి వరకు క్రిప్టో కరెన్సీపై కేంద్ర ప్రభుత్వం తన వైఖరేమిటో స్పష్టంగా వెల్లడించలేదు. ఇంతకు ముందు భారత్లో క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్పై పూర్తిస్థాయి నిషేధానికి కేంద్రం చట్టాలు తేవడానికి ప్రణాళిక రూపొందిస్తుందని వార్తలు వచ్చాయి.
ఇంతకుముందు పార్లమెంట్ వేదికగా ప్రభుత్వ వైఖరి ప్రకటన కూడా క్రిప్టో కరెన్సీ ఇండస్ట్రీని నిరాశ పరిచింది. తాజా నివేదికల ప్రకారం క్రిప్టో కరెన్సీని నియంత్రణకు కేంద్రం చర్యలు చేపట్టనున్నదన్న వార్తలు వారిలో ఆశలు రేకెత్తిస్తున్నాయి.
జెబ్ పే సహా-సీఈవో అవినాశ్ శేఖర్ మాట్లాడుతూ క్రిప్టో కరెన్సీలపై విధి విధానాల ఖరారుకు నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని భావించడంతో ప్రభుత్వం సరైన మార్గంలో ప్రయాణిస్తుందన్నారు.
భారత్లో క్రిప్టో కరెన్సీల నియంత్రణ విషయం ప్రభుత్వం అన్ని వర్గాలను, వాటాదారులందరినీ సంప్రదిస్తుందని నమ్ముతున్నామని అవినాశ్ శేఖర్ వెల్లడించారు. క్రిప్టో కరెన్సీల్లో మదుపర్లు పెట్టిన పెట్టుబడులకు రక్షణ లభిస్తుందన్నారు.
ప్రస్తుతం భారత్లో 1.5 కోట్ల మంది రిటైల్ ఇన్వెస్టర్లు క్రిప్టో కరెన్సీలపై పెట్టుబడులు పెట్టారు. రూ.15 వేల కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టారని తెలుస్తోంది. ఇటీవల క్రిప్టో కరెన్సీలు రక్తమోడటంతో వాటిల్లో మదుపర్ల పెట్టుబడులకు భద్రతపై తొలిసారి చర్చ తలెత్తింది.
నోట్లు ముద్రించడమే మార్గం.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?
ప్రపంచంలో అత్యంత కుబేరుడిగా జెఫ్ బెజోస్ స్థానం పదిలం
వ్యాక్సినేషన్ తోనే ఎకానమీపై మహమ్మారి ఎఫెక్ట్ కు చెక్ : ఆర్బీఐ
వ్యాక్సిన్లపై పన్ను కోతలేనట్లే!
హనుమంతుని జన్మస్థలంపై అసంపూర్తిగా ముగిసిన చర్చ
తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో రేపు ప్రధాని పర్యటన
ఐటీ కొత్త రూల్స్.. ఆందోళన వ్యక్తం చేసిన ట్విట్టర్ సంస్థ
మామిడి పండ్లు తినగానే ఆ ఐదింటి జోలికి అసలే పోవద్దు..!
నన్నెవరూ అరెస్ట్ చేయలేరు : రాందేవ్ బాబా
యాంటీబాడీ కాక్టెయిల్ ట్రయల్స్కు జైడస్ దరఖాస్తు
భారతీయ ఐటీ చట్టాలకు కట్టుబడి ఉన్నాం : గూగుల్ సీఈవో
12 సంవత్సరాలు పైబడిన వారికి మా వ్యాక్సిన్ సురక్షితం : ఫైజర్
దగ్ధమైన సింగపూర్ నౌక.. పర్యావరణానికి పెనుముప్పు