న్యూఢిల్లీ: మీరు బ్రిటన్కు వెళ్లాలని ప్రణాళిక వేసుకున్నారా.. అయితే టికెట్ల ధరలో మాత్రం రిలీఫ్ లేదు. టికెట్ల ధరలు భారీగా పెంచేశాయి వివిధ ఎయిర్ లైన్స్.
ఈ నేపథ్యంలో న్యూఢిల్లీ-లండన్ మధ్య విమాన సర్వీస్పై విస్తారా.. ఎకానమీ క్లాస్ టికెట్ ధర రూ.1,03,191 నుంచి రూ.1,21,356 వసూలు చేస్తున్నట్లు ప్రకటించింది.
బ్రిటిష్ ఎయిర్వేస్ టికెట్ ధర రూ.1,28,916-1,47,544 పలుకుతున్నది. డీజీసీఏ పిలుపు మేరకు వివిధ విమానయాన సంస్థలు తమ టికెట్ల ధరలపై నివేదిక సమర్పించాయి.
ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణిస్తే రూ.1,15,936, వర్జిన్ అట్లాంటిక్లో ప్రయాణిస్తే రూ.1,28,916 చెల్లించి టికెట్ కొనుగోవాల్సి ఉంటుంది.
ఇప్పటికైతే వారానికి భారత్-బ్రిటన్ మధ్య 30 విమాన సర్వీసులు మాత్రమే నడుస్తాయి. విస్తారా అధికార ప్రతినిధి స్పందిస్తూ.. సప్లయ్, డిమాండ్ మధ్య టికెట్ల ధర ఖరారవుతుందన్నారు.
వారానికి కేవలం 15 విమాన సర్వీసులు మాత్రమే నడిపేందుకు అనుమతి లభించిందన్నారు విస్తారా అధికార ప్రతినిధి. మున్ముందు రెండు దేశాల విమాన సర్వీసులు పెరిగితే టికెట్ల ధరలు ఆటోమేటిక్గా తగ్గుముఖం పడతాయని పేర్కొన్నారు.