న్యూఢిల్లీ: కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో మహారాష్ట్రలో మాదిరిగా మరిన్ని రాష్ట్రాలు మినీ లాక్డౌన్లు విధిస్తే మైక్రో ఫైనాన్స్ సంస్థలు దెబ్బ తింటాయని క్రిసిల్ రేటింగ్స్ ఆందోళన వ్యక్తం చేసింది.
కరోనా మహమ్మారిని నియంత్రించడానికి మినీ లాక్డౌన్లు, రాత్రి వేళ కర్ఫ్యూలు, ఆంక్షలు కొనసాగిస్తే.. సంబంధిత మైక్రో ఫైనాన్స్ సంస్థల రుణ వసూళ్లపై ప్రతికూల ప్రభావం పడుతుందని క్రిసిల్ పేర్కొంది.
మహారాష్ట్రలో కరోనా రెండో వేవ్లో అత్యధిక కేసులు నమోదు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలాఖరు వరకు మినీ లాక్డౌన్ ప్రకటించింది. కొన్ని ఇతర రాష్ట్రాలు రాత్రి కర్ఫ్యూ, వారాంత లాక్డౌన్ ప్రకటించాయి.
మైక్రో ఫైనాన్స్ రుణాల మంజూరులో టాప్-5 రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఒకటిగా ఉంది. గతేడాది డిసెంబర్ నాటికి రూ.16,700 రుణాలివ్వగా, వాటిలో ఏడు శాతం మైక్రో ఫైనాన్స్ సంస్థల వాటా ఉంది. ఇక బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీ-ఎంఎఫ్ఐస్) వాటా 40 శాతం (రూ.6,700 కోట్లు) ఉన్నాయి.
తాజా మినీ లాక్డౌన్లు, ఆంక్షలు విధించడానికి ముందు మహారాష్ట్రలో రుణాల వసూళ్లు 85-90 శాతం ఉండేవి. జాతీయ స్థాయిలో సగటు రుణాల వసూళ్లు 90-94 శాతంగా ఉంది.
కరోనాకు ముందు రుణాల వసూళ్లు 98-99 శాతంగా ఉంటే, తాజాగా గత కొన్ని నెలలుగా అది 90-94 శాతానికి పడిపోయిందని క్రిసిల్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ ఓసియర్ క్రుష్ణన్ సీతారామన్ తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
కొవిడ్ రికవరీ రేటు మళ్లీ తగ్గిపోతోంది: కేంద్రం
మనిషిని పోలిన జీవికి మేక జన్మ.. దేవుడంటూ పూజలు
నిబంధనలు ఉల్లంఘిస్తే యమలోకానికే.. యముని వేషంలో కొవిడ్పై అవగాన..!
తెలంగాణలో కొత్తగా 2,478 కరోనా కేసులు
‘పుష్ప’ షేర్స్ పై కన్నేసిన అల్లు అర్జున్..?
పుష్ప’ షేర్స్ పై కన్నేసిన అల్లు అర్జున్..?
తక్కువ సిబిల్ స్కోర్తోనూ పర్సనల్ లోన్.. అయితే!