కట్టంగూర్ (నకిరేకల్), మే 3 : నల్లగొండ జిల్లా నకిరేకల్ మున్సిపాలిటీలో గులాబీ జెండా ఎగిరింది. మొత్తం 20 వార్డుల్లో 11 చోట్ల టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. 6 వార్డుల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, రెండు వార్డుల్లో కాంగ్రెస్, ఒకరు ఇండిపెండెంట్ గెలిచారు. నకిరేకల్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉదయం 5 గంటలకు మొదలైన కౌంటింగ్ ప్రక్రియ మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగింది. కౌంటింగ్ ప్రక్రియను ఎన్నికల పరిశీలకురాలు, ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్పాటిల్, ఎస్పీ రంగనాథ్ పరిశీలించారు.