మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్
హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): జూన్ నెలాఖరు నుంచి రెండోవిడత గొర్రెల పంపిణీ చేపట్టనున్నట్టు పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. సోమవారం మాసబ్ట్యాంక్లోని తన కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. ఉపాధి హామీ పథకం కింద ఆరు పశువులకు సరిపడేలా రూ.57వేలతో షెడ్లను నిర్మిస్తున్నట్టు పేర్కొన్నా రు. మొత్తం 6,453 మంది రైతులు షెడ్ల కోసం దరఖాస్తు చేసుకోగా 3,631 షెడ్ల నిర్మాణం పూర్తయిందని తెలిపారు. అన్ని జిల్లాల్లో గొర్రెల మార్కెట్లను నిర్మిస్తామని, ఇప్పటికే పెద్దపల్లిలో పనులు ప్రారంభించినట్టు తెలిపారు. త్వరలోనే తెలంగాణ బ్రాండ్ మాంసాన్ని మార్కెట్లోకి తెస్తామన్నారు. గొర్రెల పెంపకంలో శిక్షణ ఇచ్చేందుకు రంగారెడ్డి జిల్లా మామిడిపల్లిలో 55 ఎకరాల్లో నిర్మించనున్న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కు మే మొదటివారంలో శంకుస్థాపన చేస్తామని తెలిపారు.