హెక్టర్ సెవెన్ సీటర్

- గరిష్ఠ ధర రూ.18.33 లక్షలు
న్యూఢిల్లీ, జనవరి 7: దేశీయ వాహన మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఎస్యూవీ హెక్టర్ను ఏడు సీట్ల వెర్షన్ను మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకొచ్చింది ఎంజీ మోటార్. ఈ వాహనం రూ.13.35 లక్షలు మొదలుకొని రూ.18.33 లక్షల మధ్యలో లభించనున్నదని తెలిపింది. దీంతోపాటు రూ.12.89-19.13 లక్షల లోపు ధర కలిగిన 2021 వెర్షన్ హెక్టార్ను కూడా ప్రవేశపెట్టింది. భారత్లో అత్యధిక వృద్ధిని నమోదు చేసుకుంటున్న చిన్న ఎస్యూవీ సెగ్మెంట్లోకి సంస్థ ప్రవేశించడానికి ప్రయత్నాలను వేగవంతం చేసింది. ఈ ఏడాది చివర్లో చిన్న ఎస్యూవీని విడుదల చేయబోతున్నట్లు ఎంజీ మోటార్ ఇండియా ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ చాబా తెలిపారు. గతేడాది ఇండస్ట్రీ 18 శాతం వృద్ధిని నమోదు చేసుకోగా, అదే సంస్థ 77 శాతం వృద్ధిని నమోదుచేసుకున్నదని, 2021లో మాత్రం ఇండస్ట్రీ 15-20 శాతం వృద్ధి అంచనావేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుత సంవత్సరంలో సంస్థ 50 వేల యూనిట్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నది.
తాజావార్తలు
- స్వచ్ఛంద ఈపీఎఫ్వో సభ్యులకు ‘ప్రత్యేక నిధి’!
- టీటీవీ దినకరణ్తో జతకట్టిన ఓవైసీ
- మేడ్చల్లో అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
- మచ్చలేని వ్యక్తిత్వం సురభి వాణీదేవి సొంతం
- ముఖేష్ అంబానీ ఇంటి వద్ద వాహనం కేసు దర్యాప్తు ఎన్ఐఏకు బదిలీ
- ప్రముఖ గాయకుడు సిద్ శ్రీరామ్కు చేదు అనుభవం
- గురుకుల ప్రిన్సిపల్ పోస్టుల తుది ఫలితాలు వెల్లడి
- మార్చి 31 వచ్చేస్తోంది.. ఐటీఆర్తో ఆధార్ జత చేశారా?
- ఐటీ దాడులపై తాప్సీ.. తప్పుచేస్తే శిక్షకు రెడీ
- రెండో పెళ్లి వార్తలపై మరోసారి సీరియస్ అయిన సురేఖ వాణి