చెన్నై: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతున్నది. అధికార అన్నాడీఎంకే, ప్రతిపక్ష డీఎంకేతోపాటు చిన్నాచితకా పార్టీలైన కాంగ్రెస్, మక్కల్ నీది మయ్యం, డీఎండీకే తదితర పార్టీలు కూడా జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్గాంధీ రోడ్ షోలు, బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు.
తాజాగా తమిళనాడు రాజధాని చెన్నైలో రాహుల్గాంధీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నగరంలో కాంగ్రెస్ శ్రేణులు ఏర్పాటు చేసిన ఓ ప్రచారసభలో మాట్లాడిన రాహుల్గాంధీ.. కాంగ్రెస్ అభ్యర్థులకే ఓటేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. బీజేపీ తరఫున ఎన్నికైన ప్రజాప్రతినిధులు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాళ్లు మొక్కుతున్న ఫొటో ఒకటి తాను చూశానని, అలాంటి సాంప్రదాయం కేవలం బీజేపీలో మాత్రమే కనిపిస్తుందని రాహుల్గాంధీ విమర్శించారు.
బీజేపీ తరఫున ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారు ప్రధాని నరేంద్ర మోదీకో లేదంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షాకో వంగివంగి దండాలు పెట్టాల్సిందేనని రాహుల్ ఎద్దేవా చేశారు.
ఇవికూడా చదవండి..
పెండ్లిళ్లకు 100 మందికి, చావులకు 50 మందికే అనుమతి..!
రాష్ట్ర ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
బీజేపీ మహిళా నేత ముఖంపై హానికర రంగులు చల్లిన దుండగులు
ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియ దేశంలో కొనసాగుతున్నది: ప్రధాని
దేశంలోని సామాజిక కార్యకర్తల కృషి ఎనలేనిది: ప్రధాని మోదీ
చైనా సరిహద్దులో భారత జవాన్ల డ్యాన్స్.. వీడియో వైరల్
మిథాలీ రాజ్, పీవీ సింధుపై ప్రధాని ప్రశంసలు
ఎన్నికల సిత్రాలు.. దాండియా ఆడిన కేంద్ర మంత్రి
బోటు ఆపండి అంటూ కీర్తి సురేష్ పరుగో పరుగు..!
‘లవ్ స్టోరీ’లో సున్నితమైన పాయింట్..!
మీలో రక్తహీనత ఉందని తెలిపే లక్షణాలు ఇవే..!
నిజాంపేట్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.. పోలీసులను ఢీకొట్టిన కార్లు