న్యూఢిల్లీ : మంత్రాలు, మహిమలతో కరోనా మహమ్మారిని తరిమికొడతామంటూ బాబాలు, నాటు వైద్యులు ముందుకొచ్చిన ఉదంతాలు కోకొల్లలు. గో..కరోనా గో, కరోనా భాగ్ ఝా వంటి నినాదాలూ నిన్నమొన్నటి వరకూ వినిపించగా తాజాగా ఓ పూజారి కొవిడ్-19ను తరిమికొట్టేందుకు ఓం కరోనా భాగ్ స్వాహా అంటూ యజ్ఞం నిర్వహిస్తున్న వీడియో వైరల్ గా మారింది. స్వాహా..స్వాహా అంటూ ఆయన పూజను కొనసాగించడం ఈ వీడియోలో కనిపించింది.