కోల్కతా : పశ్చిమ బెంగాల్ ఎన్నికలను బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలో 21న ఆ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయనుంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కోల్కతాలో ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయ్వర్గీస్ శుక్రవారం తెలిపారు. శాసనసభ ఎన్నికల్లో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ నడుమ హోరాహోరీ నెలకొనే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే ఇరు పార్టీల అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. 294 స్థానాలున్న పశ్చిమ బెంగాల్ శాసనసభకు ఎనిమిది విడతల్లో ఎన్నికలు జరుగనున్నాయి. తొలివిడత ఎన్నికలు ఈ నెల 27 నుంచి ప్రారంభమై.. ఏప్రిల్ 29న ముగుస్తాయి. మార్చి 2న ఓట్ల లెక్కింపు చేపట్టి విజేతలను ప్రకటిస్తారు.