లండన్: పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడు మెహుల్ చోక్సీని భారత్కు తరలించేందుకు అవకాశాలు మెరుగయ్యాయి. చట్ట విరుద్ధంగా నాటకీయ ఫక్కీలో అంటిగ్వా అండ్ బార్బుడా నుంచి డొమినికాకు వెళ్లిన చోక్సీకి యూకే ప్రీవీ కౌన్సిల్లో దావా వేసే అవకాశం లేదని ఆయన తరఫు న్యాయవాది మైఖెల్ పొలాక్ చెప్పారు.
డొమినికాకు పారిపోయినందున అంటిగ్వా పౌరసత్వం తొలగించకుండా అడ్డుకునేందుకు ప్రీవీ కౌన్సిల్లో చోక్సీ తరఫున పిటిషన్ వేసేందుకు మైఖేల్ పొలాక్ ప్రయత్నించారు. అంటిగ్వా అండ్ బార్బుడాకు బ్రిటన్ రాణి ఎలిజబెత్ అధిపతి. అందువల్ల అంటిగ్వా పౌరసత్వం రక్షణ కోసం ప్రీవీ కౌన్సిల్లో చోక్సీ పిటిషన్ వేయడానికి ప్రయత్నించారు.
అంటిగ్వా పౌరసత్వం కాపాడుకునేందుకు, భారత్కు తనను అప్పగించకుండా అడ్డుకునేందుకు చోక్సీకి ప్రీవీ కౌన్సిల్లో దావా చివరి అవకాశం అని పొలాక్ తెలిపారు. ఇక చోక్సీని వేధించారన్న అభియోగంపై దర్యాప్తు చేయాలని యూకే మెట్రో పాలిటన్ పోలీస్ వార్ క్రైమ్ యూనిట్ వద్ద ఫిర్యాదు చేశారు.
యూకే ప్రీవ్యూ కౌన్సిల్ స్థానే కరీబియన్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ను ఫైనల్ కోర్ట్ ఆఫ్ అపీల్గా నిర్ణయిస్తూ 2018 నవంబర్లో అంటిగ్వాలో జరిపిన రాజ్యాంగ రిఫరెండం తీర్మానించింది. అంతకుముందు 2015లోనే యూకే ప్రీవీ కౌన్సిల్ను ఫైనల్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ హోదా నుంచి డొమినికా ఉపసంహరించుకున్నది.
ఇదిలా ఉంటే, తనను బ్రిటన్లోని కిడ్నాప్ చేశారన్న చోక్సీ ఆరోపణను ఇద్దరు భారత సంతతి పౌరులు ఖండించారు. తాము అసలు అతడ్ని ఎప్పుడూ చూడలేదని, కలుసుకోలేదని చెప్పారు.
మరోవైపు మెహుల్ చోక్సీని నిషేధిత ఇమ్మిగ్రెంట్ అని డొమినికా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో భారత్కు అతడ్ని తరలించే అవకాశాలు మెరుగయ్యాయి. గత నెల 23న అద్రుశ్యమైన మెహుల్ చోక్సీ తనను కిడ్నాప్ చేశారన్న వాదనను మరోసారి పునరుద్ఘాటించారు.