న్యూఢిల్లీ, మే 20: పెట్రో మార్కెటింగ్, రిఫైనింగ్ కంపెనీ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్పీసీఎల్) నికరలాభం మార్చి త్రైమాసికంలో భారీగా పెరిగి రూ. 3,018 కోట్లకు చేరింది. గతేడాది జనవరి-మార్చిలో ఈ లాభం రూ. 27 కోట్లు మాత్రమే. ఇంధన నిల్వలతో వచ్చిన లాభాలతో పాటు రిఫైనింగ్ మార్జిన్లు పెరగడంతో తాజా త్రైమాసికంలో లాభాదాయకత మెరుగుపడిందని హెచ్పీసీఎల్ సీఎండీ ఎంకే సురానా గురువారంనాడిక్కడ మీడియాకు తెలిపారు. ముంబై, విశాఖపట్నంలో రిఫైనరీలు కలిగిన హెచ్పీసీఎల్ ఇంధనంగా మార్చడానికి ప్రతీ బ్యారల్ క్రూడ్పై 8.11 డాలర్ల చొప్పున ఆర్జించింది.