న్యూఢిల్లీ: కరోనా రెండో వేవ్తో దేశమంతటా వ్యాపార లావాదేవీలన్నీ తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. కానీ దేశంలోనే అతిపెద్ద ఆటోమొబైల్స్ సంస్థలు మారుతి సుజుకి (ఎంఎస్ఐ), మహీంద్రా అండ్ మహీంద్రా, టయోటా కిర్లోస్కర్ వంటి సంస్థలు దీర్ఘకాలిక వ్రుద్ధి లక్ష్యాలను నిర్దేశించుకున్నాయి.స్వల్ప కాలికంగా బిజినెస్పై ప్రతికూల ప్రభావం కనిపిస్తున్నది. మహమ్మారి వల్ల పర్సనల్ మొబిలిటీ ప్రాధాన్యం పెరుగుతుందన్నందున పాత కార్ల స్థానంలో కొత్త కార్ల కొనుగోళ్లు జరుగుతాయి.
మారుతి సుజుకి ఇండియా సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాత్సవ మాట్లాడుతూ ఈ ఏడాది కార్ల బిజినెస్ ఎలా ఉంటుందో చెప్పడం చాలా కష్టం అని అన్నారు.కరోనా నియంత్రణకు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్లు, కర్ఫ్యూలు, ఇతర ఆంక్షలు విధించడంతో కార్ల లభ్యతపై ఒత్తిడి ఉందని శశాంక్ శ్రీవాత్సవ చెప్పారు.
దేశవ్యాప్తంగా మారుతి సుజుకికి 570 ట్రూ వాల్యూ ఔట్లెట్లు ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో సుమారు 416 ఔట్లెట్లు మూతపడ్డాయి.వ్యక్తిగత కార్ల వాడకం పట్ల చాలా డిమాండ్ ఉంది. పర్సనల్ మొబిలిటీకి ప్రాధాన్యం ఇస్తున్నా, ప్రస్తుత పరిస్థితుల్లో కార్ల లభ్యత ఒక సవాల్గా మారింది. యూజ్డ్ కార్ల క్రయ, విక్రయాలు పెరుగుతున్నాయి.
2019-20 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే గతేడాది (2020-21)లో సుమారు 36 శాతం కార్ల విక్రయాలు తగ్గాయని మారుతి వెల్లడించింది.2019-20లో 4.18 లక్షల యూనిట్లు అమ్ముడైతే గతేడాది 2.65 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి.
గతేడాది లాగే పరిస్థితిలో రికవరీ సాధిస్తే కొత్త కార్ల కొనుగోళ్లు పెరుగుతాయని మారుతి అంచనా వేస్తున్నది.మరోవైపు యూజ్డ్ కార్ల విక్రయాలపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. గతేడాది మాదిరిగానే డిమాండ్ ఎక్కువగా ఉన్నా యూజ్డ్ కార్ల లభ్యత తక్కువ అన్నారు శశాంక్ శ్రీవాత్సవ. డీలర్షిప్లను డిజిటలైజేషన్ చేయడంతోనే కస్టమర్లకు కార్ల లభ్యత పెరుగుతుందన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో కార్ల మార్కెట్ గురించి అంచనా వేయడం కష్ట సాధ్యం అని టయోటా కిర్లోస్కర్ మోటార్ (టీకేఎం) వైస్ప్రెసిడెంట్ నవీన్ సోనీ తెలిపారు. 2021 జనవరి-మార్చి మధ్య పరిస్థితులు సాధారణ స్థాయికి చేరుకున్నాయి. 40 శాతానికి పైగా కార్ల విక్రయాలు పెరిగిపోయాయి.
2019-20తో పోలిస్తే 2020-21లో 17 శాతం కార్ల విక్రయాలు తగ్గాయని టయోటా కిర్లోస్కర్ మోటార్ (టీకేఎం) పేర్కొంది. పర్సనల్ మొబిలిటీకి ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు యూజ్డ్ కార్ల కొనుగోళ్ల కోసం గణనీయ స్థాయిలో ఇంటరెస్ట్ పెరిగింది.
మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం) యూజ్డ్ కార్ల విక్రయాలు బుల్లిష్గా ఉంటాయని తెలిపింది. తాము టెక్నాలజీపై ఇన్వెస్ట్మెంట్స్ పెంచడం కొనసాగిస్తామని మహీంద్రా ఫస్ట్ చాయిస్మ వీల్స్ సీఈవో కం ఎండీ అశుతోష్ పాండే చెప్పారు.
గత కొన్నేండ్లుగా మహీంద్రా ఫస్ట్ చాయిస్ బిజినెస్లో గణనీయ గ్రోత్ నమోదైంది. 2018-19, 2019-20 ఆర్థిక సంవత్సరాల్లో బిజినెస్ 60 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం మినహా 20 శాతం బిజినెస్ గ్రోత్ నమోదు చేసుకున్నది.
ధృతరాష్ట్రునిలా వ్యవహరిస్తున్న సోనియా : శివరాజ్ చౌహాన్
కరోనా వ్యాక్సినేషన్.. నదిలో దూకిన ప్రజలు
తొలిసారిగా చిన్ని గుండెను సృష్టించిన శాస్త్రవేత్తలు
డబ్ల్యూటీసీ పేలుడు కేసులో నలుగురికి 240 ఏండ్ల జైలుశిక్ష.. చరిత్రలో ఈరోజు
రాజస్థాన్లో 600 మందికిపైగా చిన్నారులకు అస్వస్థత.. కరోనా థర్డ్ వేవేనా?
కరోనా కల్లోలంలో దర్శనాలేమిటి మంత్రిగారూ..
లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘన.. సోదరుడి పెళ్లిలో తహసీల్దార్ డ్యాన్స్..
మాస్క్ లేకుండానే.. బైక్ ర్యాలీలో పాల్గొన్న బ్రెజిల్ అధ్యక్షుడు
వ్యక్తిగతంగా కోర్టుకు హాజరైన ఆంగ్ సాన్ సూకీ
జర ఇవి చూస్కో
విదేశాల్లో కొవాగ్జిన్ ఉత్పత్తిపై ఫోకస్! ఎలాగంటే!!
లాక్డౌన్తో నిత్యావసరాలు కుదేలు.. ఉత్పత్తి తగ్గించిన ఎఫ్ఎంసీజీ సంస్థలు
ఆకాశానికెత్తారు.. ఆపై పడదోశారు.. ఎందుకు?