న్యూఢిల్లీ, జూన్ 18: నూతన తరం మొబిలిటీ టెక్నాలజీల్ని అన్వేషించేందుకు ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి, హైదరాబాద్లోని స్టార్టప్ ఇంక్యుబేటర్ టీ-హబ్లు జతకలిసాయి. మొబిలిటీ ఛాలెంజ్ పేరిట జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు దేశ, విదేశాల్లోని స్టార్టప్లను ఆహ్వానించాయి. ఇందులో ఆటోమొబైల్ ప్రయాణాలకు కొత్త టెక్నాలజీ సొల్యూషన్స్ను స్టార్టప్లు ప్రదర్శిస్తాయని మారుతి ప్రకటన తెలిపింది. ఈ కార్యక్రమం ద్వారా కొన్ని స్టార్టప్లను ఎంపికచేయనున్నట్లు మారుతి సుజుకి ఎండీ, సీఈఓ కెనిచి అయుకావా తెలిపారు. ఎంపికైన స్టార్టప్లకు మారుతి, టీ-హబ్ల నుంచి డొమైన్ నాలెడ్జ్, ఇన్వెస్టర్ కనెక్ట్, టెస్ట్బెడ్ తదితర అంశాలకు సంబంధించిన మద్దతు, సూచనలు లభిస్తాయి.