న్యూఢిల్లీ, జూలై 20: కార్ల తయారీలో అగ్రగామి సంస్థ మారుతి సుజుకీ కూడా విద్యుత్తో నడిచే కారును విడుదల చేయబోతున్నదా! అవును అంటున్నాయి సంబంధిత వర్గాలు. పెట్రోల్, డీజిల్లు సామాన్యుడికి షాకిస్తుండటంతో ప్రత్యామ్నాయంపై దృష్టి సారిస్తున్నారు. దీంతో ఎల్పీజీ, సీఎన్జీ కార్లతోపాటు ఎలక్ట్రిక్ వాహనాలకు అనూహ్యంగా డిమాండ్ నెలకొన్నది. ఈ విభాగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ప్రముఖ వాహన తయారీ సంస్థలు సిద్ధమవుతున్నాయి. దీంట్లోభాగంగా మారుతి సుజుకీ కూడా తొలి ఎలక్ట్రిక్ వాహనాన్ని విడుదల చేయడానికి సిద్ధమైంది. 2025లో తన తొలి ఈవీని తొలుత భారత్లో విడుదల చేయబోతున్నట్లు నిక్కీ ఆసియా నివేదికలో వెల్లడించింది. ఆ తర్వాతి క్రమంలో జపాన్, యూరప్ దేశాల్లో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తున్నది. ఈ కారు ధర రూ.10 లక్షలకు పైగా ఉంటుందని అంచనా.