న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14: మారుతి సుజుకీ ప్రీమియం హ్యాచ్బ్యాక్ స్విఫ్ట్ మరో రికార్డును సృష్టించింది. 16 ఏండ్ల క్రితం దేశీయ మార్కెట్లోకి అడుగుపెట్టిన ఈ కార్లు మొత్తంగా ఇప్పటి వరకు 25 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. గత ఆర్థిక సంవత్సరంలో వాహన విక్రయాల్లో దూసుకుపోయిన స్విఫ్ట్.. ఇప్పటి వరకు 2.5 మిలియన్లకు పైగా అమ్ముడైనట్లు కంపెనీ ఒక ప్రకటనలలో వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఈ కారును వినియోగిస్తున్న వారిలో 52 శాతానికి పైగా మంది 35 ఏండ్లలోపు వారు కావడం గమనార్హం. 1.2 లీటర్ల పెట్రోల్ ఇంజిన్ కలిగిన మాన్యువల్, ఆటో గేర్ షిప్ట్ ట్రాన్స్మిషన్ కలిగిన ఈ కారు 23.20 నుంచి 23.76 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వనున్నది.