న్యూఢిల్లీ, జూలై 12: మారుతీ సుజుకీ కార్ల ధరలను పెంచింది. స్విఫ్ట్తోపాటు ఆల్టో, సెలెరియో, ఎస్-ప్రెస్సో, వాగనార్, ఈకో, ఎర్టిగా తదితర వేరియంట్ల ధరలను తయారీ ఖర్చుల భారంతో 15వేల వరకు పెంచినట్లు సోమవారం సంస్థ ప్రకటించింది.