న్యూఢిల్లీ: హర్యానా నుంచి పెట్టుబడులను గానీ, కార్ల ఉత్పత్తిని తరలించబోమని మారుతి సుజుకి చైర్మన్ ఆర్సీ భార్గవ స్పష్టం చేశారు. హర్యానాలోని రెండు ప్రొడక్షన్ ప్లాంట్ల నుంచి కార్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని గరిష్ఠంగా వినియోగించుకంటామని తెలిపారు. వివిధ మోడల్ కార్ల కోసం వచ్చిన డిమాండ్లకు అనుగుణంగా పరిగణనలోకి తీసుకుంటామన్నారు.
‘హర్యానాలోని ప్లాంట్లు పూర్తి సామర్థ్యంతో పని చేస్తాయి. ఉద్యోగాలు యధావిధిగా కొనసాగుతాయి. ఉద్యోగాల్లో ఎటువంటి మార్పు ఉండదు. గుర్గ్రామ్లో కార్ల ఉత్పత్తి తగ్గదు. ఒకవేళ ఇది (డిజైర్) మోడల్, ఇతర మోడల్ కార్ల ఉత్పత్తి మళ్లించవచ్చు. విభిన్న మోడల్ కార్ల ఉత్పత్తిని సమర్థవంతంగా బలోపేతం చేయడమే లక్ష్యం’ అని చెప్పారు.
హేతుబద్దీకరణ కోసమే డిజైర్ తదితర మోడళ్ల ఉత్పత్తిని గుజరాత్కు మారుస్తున్నట్లు తెలిపారు. హర్యానా ప్రొడక్షన్ ప్లాంట్ల నుంచి డిజైర్ కార్ల ఉత్పత్తిని గుజరాత్కు తరలిస్తున్నా హర్యానా సర్కార్ పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ నేత రణ్దీప్ సుర్జేవాలా ఆరోపించారు. దీనిపై మారుతి చైర్మన్ ఆర్సీ భార్గవ పై విధంగా స్పందించారు.